మానకొండూర్ రూరల్, మార్చి 15: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఆ రైతు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం దేవంపల్లిలో చోటుచేసుకున్నది. దేవంపల్లికి చెందిన మంద మల్లయ్య (55) శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తన అన్న చేను నుంచి పొలానికి వెళ్తుండగా, విద్యుత్తు తీగలు తెగిపడి ఉన్నాయి. ఆ తీగల ను గమనించకుండానే మల్లయ్య తన పొలం వద్దకు వెళ్తుండగా కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. బాధిత కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నామని సీఐ రాజ్ కుమార్ తెలిపారు.