బిజినేపల్లి, జనవరి 5 : ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి ఓ రైతు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్లో ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డెమాన్కు చెందిన గుంటి బంగారయ్య(40) రోజూ మాదిరిగానే తన మక్కపంటకు నీరు పారపెట్టేందుకు వెళ్లి నీటి సంపులో కాలుజారిపడ్డాడు.
ఎవరూ గమనించకపోవడంతో సంపులోనే మృతిచెందాడు. ఈ ఘటనపై భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు.