మహదేవపూర్(కాళేశ్వరం), ఫిబ్రవరి 6: అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం పల్గుల గ్రామానికి చెందిన పాలిశెట్టి మొండయ్య (46) తనకున్న ఐదెకరాల భూమిలో 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆశించిన దిగుబడి లేకపోవడంతోపాటు క్రితం సారి పంట వేయ గా వరదలు రావడంతో పంటలు దెబ్బతిన్నా యి. దీంతో సాగు కోసం చేసిన రూ.5 లక్షల అప్పు తీర్చలేక మనస్తాపంతో సోమవారం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొండయ్యకు భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు.