హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడికాపు కాస్తున్నా ధాన్యం కొనడం లేదని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పల్లి సర్పంచ్ భర్త మఠంల శేఖర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. కాగా, గ్రామ రైతులు రోడ్డుపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తుందని డీజిల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
నెల రోజులుగా కేంద్రాల వద్ద పడికాపు కాస్తున్నా కొనుగోలు జరపడం లేదని డీజిల్ పోసుకున్న ఎల్లారెడ్డి పల్లి సర్పంచ్ భర్త మఠంల శేఖర్
నిజామాబాద్ – ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లె వద్ద… pic.twitter.com/1Dgpt6jJJi
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026