హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు పలువురు అధికారులు వీడ్కోలు పలికారు.