రంగారెడ్డి : ఈ నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సలు నిర్వహించిన 27 మందిలో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి మాట్లాడారు. చనిపోయిన ఇద్దరు మహిళల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుల పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స విఫలమై మృతి చెందిన వారిలో ఎన్ మమత(22) నర్సాయిపల్లి, ఎం సుష్మా(22) లింగంపల్లి ఉన్నారు.