2014 నుంచే అమల్లోకి
హైదరాబాద్, మార్చి 7 : బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీపీఎస్ విధానంలో ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయటం లేదు. దీంతో ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే పెన్షన్ పొందలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నది. దీంతో విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ వర్తించనున్నది. 2014 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది.