కేసముద్రం, జనవరి 4: మొదటి కాన్పు లో ఆడ పిల్ల పుట్టడంతో కుటుంబ సభ్యులు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సింగిరెడ్డి రాములు కుమార్తె రజితకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన నాగేశ్వర్రావుతో వివాహమైంది. రజిత గత నెల 31న మహబూబాబాద్ ఏరియా దవాఖానలో ఆడ పిల్లకు జన్మనిచ్చింది.
బుధవారం హాస్పిటల్ నుంచి ఇనుగుర్తికి ఇంటికి చేరుకొన్నది. ఆడ పిల్ల పుట్టిన సంతోషంలో కుటుంబ సభ్యులు చిన్నారిని పూలు, బెలూన్లతో ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కావడంతో వైద్య సిబ్బంది కేసీఆర్ కిట్టు అందజేసి, 102 వాహనంలో ఉచితంగా ఇంటికి పంపించారు.