హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒక విద్యార్థి బదులుగా మరొకరు పరీక్ష రాస్తున్నట్టు ఇంటర్బోర్డు కంట్రోల్ రూంకు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఫోన్కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు స్కాడ్ను పంపించి తనిఖీలు నిర్వహించగా, అసలైన వారే పరీక్షలు రాస్తున్నట్టుగా తేలింది. తాజాగా ఒక విద్యార్థి చేయి విరగకపోయినా, విరిగినట్టు కట్టుకొని స్ర్కైబ్ సహాయంతో పరీక్షలు రాస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా నుంచి కంట్రోల్ రూంకు ఫోన్ రాగా, అధికారులు తనిఖీ చేశారు. ఆ విద్యార్థి ఎక్స్రే చూపించడంతో అది ఫేక్ కాల్గా అధికారులు తేల్చారు. కాగా, ఇంటర్ పరీక్షల్లో శనివారం ఏడుగురు డిబార్ అయ్యారని బోర్డు సెక్రటరీ నవీన్మిట్టల్ తెలిపారు.