సంగారెడ్డి: జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్ విత్తనాలు (Soybean seeds) పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ఫర్టిలైజర్ షాప్లో నకిలీ సోయాబీన్ విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో 3.7 టన్నుల విత్తనాలను సీజ్ చేశారు. వాటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విత్తనాలను మహారాష్ట్ర నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని వెల్లడించారు. రాధాకృష్ణ ఫర్టిలైజర్ దుకాణంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.