సూర్యాపేట, నవంబర్ 19 : మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రిపై తప్పుడు న్యూస్ పోస్ట్లు పెట్టి ప్రచారం చేసిన రేణు రేణుక(ఫేస్బుక్), తెలంగాణ వారియర్ (ఇన్స్టాగ్రామ్), తెలంగాణ స్ర్కైబ్(ట్విట్టర్)పై స్క్రీన్షాట్స్, అకౌంట్ లింక్సు సహా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తప్పుడు పోస్టులు పెట్టినవారిని, ఫార్వర్డ్ చేసిన వారికి పోలీసులు నోటీసులు పంపి అదుపులోకి తీసుకోన్నారు.