జడ్చర్లటౌన్, మే 24 : నకిలీ పత్తి విత్తనాలు(Fake cotton seeds) పట్టుబడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా( Mahbubnagar) జడ్చర్ల మండలంలో చోటు చేసుకున్నది. జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏఎస్పీ రాములు విలేకరులతో మాట్లాడారు.
గోప్లాపూర్లో ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు విత్తనాలు నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. దీంతో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 2.21 క్వింటాళ్లు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారని తెలిపారు. విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సమావేశంలో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు, పోలీసులు పాల్గొన్నారు.