హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): నిషేధిత నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ, హయత్నగర్ పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలోని నంద్యాలకు చెందిన రామ్మోహన్రెడ్డి.. అదే పట్టణానికి చెందిన చలివెందుల రాజారామ్, గోస స్వామి దాసు, అనుముల మల్లేశ్వరయ్య, కం దాల చిన్న ఓబులేశ్తో కలిసి నిషేధిత బీటీ-3 విత్తనాలను తెలంగాణ రైతులకు అమ్మేందుకు నంద్యాల నుంచి పెద్దఅంబర్పేట్కు తీసుకొచ్చాడు. గురువారం పెద్ద అంబర్పేట్లోని పిస్తా హౌస్ సమీపంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. నిందితుల వద్ద నుంచి 600 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లను హయత్నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.