నల్లబెల్లి/ఆర్కేపురం, సెప్టెంబర్ 4: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్రెడ్డి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొం డ, నల్లబెల్లి మండలాలకు చెందిన భూ సర్వేయర్లు శామ్యూల్, మల్లయ్య, కుశాల్కు ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారినని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో సర్వేయర్లు కుశాల్ రూ.5 వేలు, మల్లయ్య రూ.2 వేలు అతడి ఖాతాకు ఫోన్పే ద్వారా పంపారు. ఆ తర్వాత సర్వేయర్ మల్లయ్య నల్లబెల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై నగేశ్.. మిగతా డబ్బులు ఇస్తానంటూ మల్లయ్యతో నిందితుడికి ఫోన్ చేయించారు. డబ్బులు తీసుకునేందుకు శ్రీనివాస్రెడ్డి హనుమకొండ నుంచి మండలంలోని శనిగరం క్రాస్రోడ్డు వద్దకు చేరుకోగా.. పథకం ప్రకారం అక్కడే తన సిబ్బందితో మఫ్టీలో ఉన్న ఎస్సై అదుపులోకి తీసుకున్నారని సోమవారం ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు.
ఏసీబీ వలలో ఏఎస్సై, హెచ్సీ
హైదరాబాద్లోని సరూర్నగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఏఎస్సై సరళ, హెడ్కానిస్టేబుల్ నరసిం హ రూ.5 వేల లంచం తీసుకుంటూ సోమవా రం ఏసీబీ అధికారులకు చిక్కారు. కంచన్బాగ్ పీఎస్లో పనిచేసే హోంగార్డు యనయల రాము పేరు ఓ కేసులో ఉండటంతో అతని పేరు తొలగించాలని కోరాడు. వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు ఎస్సై, హెడ్ కానిస్టేబుల్కు ఒక కవర్లో రూ.5 వేలు పెట్టి ఇవ్వగా, సిటీ రేంజ్ వన్ ఏసీబీ డీఎస్పీ కే శ్రీనివాస్రెడ్డి బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది.