ములుగు : మేడారం జాతర అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం జంపన్న వాగు వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. 2022 ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్మన్ కృష్ణ జగదీశ్వర్ తో కలిసి చేపట్టిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.