చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 27: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన వారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు మోదీ, అమిత్ షా ఆటలు సాగవన్నారు. నీతిమాలిన రాజకీయం చేస్తున్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా, మండలంలోని ఎస్.లింగోటం ప్రతిష్ఠ పరిశ్రమ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలని యాజమాన్యంతో మట్లాడి సమస్యను పరిష్కరించారు.