హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్కాడ్తో ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం రూ.3,51,65,450 నగదు స్వాధీనం చేసుకొన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే రూ.లక్ష నగదును సీజ్ చేశామని పేర్కొన్నారు. పోలీస్ అథారిటీ ద్వారా ఇప్పటివరకు రూ.48,89,70,332 నగదును సీజ్ చేశామని వివరించారు. లా అండ్ ఆర్డర్ లైసెన్స్ కింద 4,561 ఆయుధాలను సేకరించామని తెలిపారు. 939 సీఆర్పీసీ కేసులు, 2,483 బైండోవర్, 2,427 నక్కస్ ఆపరేషన్లు చేసినట్టు వివరించారు. 2,110 నాన్ బెయిలబుల్ వారెంట్లను నమోదు చేశామని తెలిపారు. 5,498 వాల్ రైటింగ్లను, 84,273 పోస్టర్లను, 29,383 బ్యానర్లను తొలగించినట్టు చెప్పారు. ఇప్పటివరకు తొలగించామని. ఎక్సైజ్ శాఖ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద మలక్పేటలో 3, జూబ్లీహిల్స్లో 1 కేసులు నమోదయ్యాయని రోనాల్డ్ రోస్ తెలిపారు.