హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్బోర్డు పొడిగించింది. ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగియనుండగా.. ఫిబ్రవరి 4 వరకు పెంచింది. జనవరి 5 నుంచి ఫీజులను స్వీకరిస్తుండగా.. 8వ తేదీ నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. షెడ్యూల్లో మార్పులు చేసి, సవరించిన షెడ్యూల్ను ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ శనివారం విడుదలచేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీలన్నీ తాజా షెడ్యూల్ ప్రకారమే విద్యార్థుల నుంచి ఫీజులను స్వీకరించాలని జలీల్ సూచించారు.
షెడ్యూల్ తేదీలు
ఫైన్ లేకుండా 5-1-22 నుంచి 4-2-22
200 ఫైన్తో 5-2-22 నుంచి 10-2-22
1,000 ఫైన్తో 11-2-22 నుంచి 17-2-22
2,000 ఫైన్తో 18-2-22 నుంచి 24-2-22