SEC | హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా ఆదేశాలు జారీ చేశారు. 2020 సెప్టెంబర్ 9న రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన మూడు సంవత్సరాల పదవీ కాలం శుక్రవారంతో ముగియడంతో మరో సంవత్సరం పాటు పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.