హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీకాలం మరో రెండేండ్లపాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల కాపీని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కంచర్లకు అందజేశారు.
తన పదవీకాలం పొడిగించిన సీఎం కేసీఆర్కు, ఇందుకు సహకరించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో భారీ విస్తీర్ణంలో ఆయిల్పామ్ సాగుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.