హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.