హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జోన్(SCR) ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న 22 ప్రత్యేక రైళ్లను మళ్లీ పొడిగిస్తూ శుక్రవారం రైల్వే జోన్ అధికారులు(Railway Zone Offiecers) నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్- దర్బంగ్, హైదరాబాద్-గోరఖ్పూర్, సికింద్రాబాద్-ధనపూర్, మధురై-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ వంటి పలు రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రత్యేక రైళ్లను(Special Trains) పొడిగించారు. ఈ నెల 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ వారీగా ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్యరైల్వేకు పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ అవార్డులు
సివిల్ ఇంజినీరింగ్ విభాగం, నిర్మాణానికి సంబంధించి రెండు విభాగాలలో దక్షిణ మధ్య రైల్వే రెండు పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్-2023 పొందింది. ఈ షీల్డ్ అవార్డును ఈ నెల 15న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఎస్సీఆర్ జీఎం అరుణ్కుమార్ జైన్ అందుకోనున్నారు.