హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఈ బస్సు అందుబాటులో ఉంటుందని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి ఝరాసంగంకు ఉదయం 7 గంటలకు బయలుదేరుతుందని, మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగివస్తుందని ఎండీ సజ్జనార్ శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.