హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి, వాటిని దూరంగా తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని పరిశీలించిన పోలీసులు సినిమాల్లో వాడే బాంబులుగా గుర్తించారు.
ఎనిమిది కార్టన్లలో సుమారు వంద బాంబులు ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ నెల 14న చిలకలూరిపేట నుంచి పుణెకు ఎనిమిది కార్టర్ల పార్సిల్ బుక్ అయ్యింది. పేలుడు పదార్థాల వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. చివరకు సినిమాల్లో వినియోగించే బాంబులని తేల్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఈ నెల 15న హైదరాబాద్లోని నవతా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి పార్శిల్ చేసుకున్నది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది.