Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు సానుభూతిపరులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద 400 జిలెటిన్ స్టిక్స్, వెయ్యి డిటోనేటర్లు, విద్యుత్ తీగలతో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు పదార్థాలను ఎప్పట్నుంచి సరఫరా చేస్తున్నారని, దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.