కొత్తకోట, డిసెంబర్ 7: నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను కంటైనర్ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో చోటుచేసుకున్నది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ పంక్చర్ అయింది.
దీంతో మంగళవారం అర్ధరాత్రి కొత్తకోట సమీపంలో హైవే-44పై ఉన్న టెక్కాలయ్య దర్గా వద్ద ట్యాంకర్ను డ్రైవర్ నిలిపాడు. అయితే ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న పార్సల్ కంటైనర్ వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ట్యాంకర్ పగిలి మంటలు అంటుకున్నాయి. కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో పాటు క్యాబిన్ కాలిపోయింది. ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్లు అప్రమత్తంగా తప్పించుకున్నారు. రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ట్యాంకర్ డ్రైవర్ మోహిన్ తెలిపారు.