హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మైగ్రేంట్స్ అండ్ వెల్ఫేర్ తరఫున ఖతార్లోని దోహా లేబర్ సిటీలో కార్మికులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని, వివిధ అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రవాస భారతీయ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రాబోయే బడ్జెట్లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా హాజరైన కార్మికులు కోరారని తెలిపారు.
ఇండియాకు తిరిగొచ్చిన కార్మికులకు పునరావాసం కల్పించేందుకు బోర్డు చొరవ తీసుకుంటుందని తామంతా అభిప్రాయడినట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ గల్ఫ్ సమితి నాయకులు పాటుకూడు తిరుపతిరెడ్డి, సంజీవ్, థామస్, మహేందర్తో పాటు లేబర్ సిటీ కార్మికులు మల్లేశ్, సునీల్, సాయికుమార్, శ్రీనివాస్, అజిత్, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారని పేర్కొన్నారు.