హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగా ణ): టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపా రు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లా జిస్టిక్స్ మోడల్ కౌంటర్ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం లాజిస్టిక్స్ విభా గం లోగో, బ్రోచర్ను ఆవిషరించి, పార్సిళ్లను ఇంటి దగ్గరి నుంచి సేకరించడం, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ..
టీ ఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం రాష్ట్రంలో అతివేగంగా పార్సిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్లో పార్సిళ్ల హోం పిక ప్, డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని చె ప్పారు. లాజిస్టిక్స్ సేవలపై సలహాలు, సూచనలకు 040-69440069, https//www. tsrtclogistics.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు. టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(కమర్షియ ల్) శ్రీధర్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం సంతోష్కుమార్ పాల్గొన్నారు.