Telangana | హైదరాబాద్ : రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే శాఖ కూడా అవడంతో రిలాక్సేషన్ ఇచ్చినట్లు తెలిపారు.