హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ నివాసాల నుండి సంబంధిత కార్యాలయాల వరకు అధికారిక పనుల నిమిత్తమై వెళ్ళడానికి న్యాయవాదులకు ఈ-పాస్ లను సంబంధిత పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలు జారీ చేస్తాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీ చేసే ఈ-పాస్ లకై policeportal.tspolice .gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ కార్యాలయం ఆదేశాలను జారీచేసింది.