హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మత్తుమందును తీసుకొస్తున్న 10 మందిని అరెస్టు చేశారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. వారిని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.