హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఉన్నదా, ఉంటే జాడ చెప్పండి.’ అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విషయమై పట్టించుకోని ప్రభుత్వ వైఖరిపై ఆయన స్పందించారు. ఫిబ్రవరి 14న ఎల్బీ స్టేడియం లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటం గా ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన 614 మం దికి నియామకపత్రాలు అందించారని, శిక్షణకు పంపకపోవడంతో గత 40 రోజుల నుంచి వారంతా త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగితే తన చేతిలో ఏమీ లేదు, ప్రభుత్వాన్ని అడగండని బాధితులతో అంటున్నారంటూ తెలిపారు. ఒక అభ్యర్థి ఆవేదన లేఖను కూడా ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.