హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ(సీడీఎంఏ)లో పనిచేస్తున్న వార్డు ఆఫీసర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకే పోస్టు, ఒకే రకమైన బా ధ్యతలు నిర్వర్తిస్తున్నా.. కొందరు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వేతనం, మరికొందరు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ వేత నం పొందుతున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 ద్వారా ఎంపికైన 1,862 మంది వార్డు ఆఫీసర్లు ప్రస్తుతం ఈ వేతన వివక్షతో కుంగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ విధు లు నిర్వర్తిస్తున్న తమపై కాంగ్రెస్ ప్రభు త్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని మండిపడుతున్నారు.
గత ప్రభుత్వంలో రెవెన్యూశాఖ నుంచి మున్సిపల్శాఖలో విలీనమైన వీఆర్ఏలు, వీఆర్వోలను వార్డు ఆఫీసర్లుగా నియమించి, వారికి ‘జూనియర్ అసిస్టెంట్’ క్యాడర్ పేసేల్ అమ లు చేస్తున్నారు. ఇటీవల కొందరు తిరిగి రెవెన్యూశాఖకు వెళ్లినప్పటికీ, మరికొందరు మున్సిపల్ శాఖలోనే జూనియర్ అ సిస్టెంట్ క్యాడర్ వేతనంతో కొనసాగుతున్నారు. కానీ, గ్రూప్-4 ద్వారా నియమితులైన వార్డు ఆఫీసర్లకు మాత్రం ‘రికార్డ్ అసిస్టెంట్ పేసేల్ మాత్రమే ఇస్తున్నా రు. ఒకే ఆఫీసులో, ఒకే సీట్లో కూర్చుని ఒకే పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో వేతన తేడా ఏంటని వార్డు ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.