గణపురం, ఆగస్టు 5 : అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్ కాపీ అందించిన అధికారులు.. అప్పుచేసి స్థలం కొని.. అందులో పిల్లర్లు లేపుకున్న తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. గతంలోనే మీ పేరు తో ఇల్లు మంజూరైందని, ఇప్పుడు బిల్లులు రావని చెప్పడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నది. బాధితులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన మావురపు లలిత-సమ్మయ్య దంపతులకు 2025 జూలై 16న జరిగిన గ్రామసభలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ అందజేశారు.
దీంతో ఆ దంపతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి స్థలాన్ని కొనుగోలు చేసి, ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి పిల్లర్లు కూడా లేపా రు. అయితే పనులు మొదలై ఏడాది గడుస్తున్నా అధికారులు బిల్లులు మంజూరు కాకపోవడంతో అధికారులను నిలదీశారు. దీంతో మీకు ఉమ్మడి రాష్ట్రంలో (2006-2007) ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు రికార్డుల్లో ఉందని, అందువల్లే బిల్లులు రావడం లేదని చెప్పారు. అయితే గతం లో తీసుకున్న డబ్బులను మినహాయించి మిగిలినవి విడుదల చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తా ము చెల్పూరు ప్రభుత్వ ఆస్పత్రి పకన డ్రైనేజీపై ఏర్పాటు చేసుకున్న చిన్న రేకుల షెడ్డులోనే కాలం వెళ్లదీస్తున్నామంటూ కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఇంటి బిల్లును విడుదల చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.