హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల డిజైన్లను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. త్వరలో వీటిని ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో జనాభా భారీగా పెరుగుతున్నందున భవిష్యత్ అవసరాలు, సమావేశాలు, సెమినార్లు, శిక్షణా కార్యక్రమాల కోసం సీవోఈని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే సూచించారు. ఈ సూచనకు అనుగుణంగా సకల సౌకర్యాలతో సీవోఈని ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిజైన్లను పరిశీలించినవారిలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
కేటీఆర్తో జనాగ్రహ సంస్థ సీఈవో భేటీ మంత్రి కేటీఆర్తో జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్షిప్ అండ్ డెమోక్రసీ సీఈవో శ్రీకాంత్ విశ్వనాథన్ సమావేశమై పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలపై చర్చించినట్టు సమాచారం.