ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ కలినరీ ఆర్ట్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను ఈ నెల 24నుంచి, మూడేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్ ఐదేండ్ల బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ, తదితర కోర్సుల సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 26 నుంచి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎంసీఏ నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను సెప్టెంబర్ ఒకటి నుంచి, బీసీఏ నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను ఏడు నుంచి, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను 14నుంచి జరుపనున్నట్టు వివరించారు. వివరాలకు www.osmania.ac.inలో చూడాలని సూచించారు.
ఎంఈ కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ
ఓయూ పరిధిలోని ఎంఈ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజును ఈ నెల 20 వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు అవకాశం ఉన్నది.
ఎంపీఈడీ పరీక్షలు వాయిదా
ఓయూ పరిధిలోని ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 24 నుంచి జరగాల్సిన పరీక్షలను వివిధ కారణాల రీత్యా వాయిదా వేశారు.
ఎంబీఏ జవాబు పత్రాల ఫొటోకాపీకి దరఖాస్తులు
పీజీఆర్ఆర్సీడీఈ పరిధిలోని ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్ష జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు, చాలెంజ్ వాల్యుయేషన్కు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఫార్మసీ పరీక్ష ఫలితాల విడుదల
ఓయూ పరిధిలోని బీఫార్మసీ (సీబీసీఎస్) నాలుగు, ఆరు, ఎనిమిదో సెమిస్టర్తోపాటు బీఫార్మసీ (నాన్ సీబీసీఎస్) నాలుగో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. www.osmania.ac.inలో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు
దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (పాత ఏఎంఎస్)లో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ (ఒక సంవత్సరం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. టెన్త్ పాసైన అన్ని వయస్సులవారు అర్హులు. వివరాలకు 9397824542 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు.
మాలిక్యులార్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ కోర్సులో ప్రవేశాలు
ఓయూ పరిధిలోని ఎమ్మెస్సీ – మాలిక్యులార్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. అభ్యర్థులు సెప్టెంబర్ 10వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.