హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): జపాన్ ప్రభుత్వ పథకం కింద పనిచేసేందుకు నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కోసం సోమవారం హైదరాబాద్ విద్యానగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ (ఎన్ఎస్ఐటీ) సెంటర్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కామ్) ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 22 నుంచి 30 ఏళ్ల వయసు గల తాజా నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జీఎన్ఎం డిప్లొమా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందస్తు పని అనుభవం అవసరం లేదు. వివరాలకు టామ్కామ్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.