హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఏపీలోని అనంతపురంలో ఇంజినీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దారుణహత్యకు గురయ్యారు. నగరంలోని జేఎన్టీయూ ప్రవేశద్వారానికి ఎదురుగా ఉండే కాలనీలో నివాసముండే మూర్తిరావు ఖోకలే గతంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో పనిచేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ఖోకలే మేనల్లుడు ఆయనపై దాడిచేసి బ్లేడ్తో గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని, ఆస్తి తగాదాలు, కూతురు పెళ్లి విషయం నచ్చక హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.