జనగామ, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ): దళితబంధు పేరుతో తాను డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణలను జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం జనగామలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబ సమస్యను సాకుగా చూపి కొందరు తనకు జనగామ ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చేశారన్నారు. కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాను మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను దెబ్బతీసేందుకు బద్దిపడిగే కృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.