హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పాత వేతనాలను అమల్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 29న రాత్రికి రాత్రే అశాస్త్రీయంగా కొత్త వేతనాల రివిజన్ డ్రాఫ్ట్కు జీవో విడుదల చేసిందని, ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.