Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కళ్యాణార్థం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాజకీయం చేయడం సరికాదు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెకంటరమణారెడ్డి పేర్కొన్నారు.
ఆలయం రాత్రికి రాత్రి నిర్మించింది కాదు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది. గుడి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఆలయం పక్కనే అర్చకులకు, సూపర్వైజర్లకు, వంట మనుషులకు, దేవుని సామాగ్రి భద్రపరచడం కోసం, భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పుడు గుడి పనులను ఆపడం, నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమే. ప్రజలంతా దీన్ని గమనిస్తున్నారు అని గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.