Niranjan Reddy | భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవమానించడమంటే దేశ ప్రజలను.. భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చరిత్రలో మొదటి నుంచి అంబేద్కర్ను అవమానించుకుంటూ వచ్చిందని, భారత రత్న అవార్డును ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో నిలబడితే కూడా అంబేద్కర్ను ఓడించారని ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అతి పెద్ద విగ్రహానికి సీఎం, మంత్రులు నివాళులు అర్పించకపోవడం, ప్రాంగణం గేటు మూసివేయడం ఆయనను అవమానించడమేనన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అంబేదర్ జయంతి సందర్భంగా మంత్రులు, సీఎం నివాళులు అర్పించక పోగా ప్రజలు, ప్రజా సంఘాలు గానీ వెళ్లకుండా స్మృతివనానికి తాళాలు వేయడం దుర్మార్గమన్నారు. భారీ విగ్రహాన్ని కేసీఆర్ స్థాపించారనే అకసుతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అదే నిజమైతే కేసీఆర్ కట్టిన సచివాలయంలో కూర్చోవడం మానేయాలని, కేసీఆర్ కట్టిన మిషన్ భగీరథ నుంచి తాగునీరు ఇవ్వకుండా దమ్ముంటే ఇంకో వ్యవస్థతో నీళ్లివ్వాలని మాజీ మంత్రి సవాల్ విసిరారు. ఎన్నికల్లో స్వయంగా అంబేద్కర్ పోటీ చేస్తే కాంగ్రెస్సే ఓడించిందని.. ఆ తర్వాత దాదాపుగా నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా… కానీ వారి హయాంలో అంబేదర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి అంబేదర్పై ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. కాంగ్రెసేతర వీపీ సింగ్ హయాంలో అంబేద్కర్కు భారతరత్న అవార్డు ఇచ్చారన్నారు. దళితులను, మైనారిటీలను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగా భావిస్తున్నది .. ఎవరికైనా భ్రమలు ఉంటే తొలగించుకోవాలన్నారు. అంబేదర్ ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజలను అవమానించడమే వ్యతిరేకించడమేనని, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇకపై నుంచి పోరాటం బీజేపీపై అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్ని రోజులు ఏం చేశారని నిలదీశారు. బీజేపీపై పోరాడే దమ్ము బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు కేసీ వేణుగోపాల్కు అర్థం కావని.. కాంగ్రెస్కు ఓట్లు, సీట్లే తెలుసని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ లేదనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ మిషన్ 15 అంటున్నారని, చేతనైతే పకన ఒకటి తీసేసి 5 గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో కేసీఆర్ ఒక్కరు ఉన్నప్పుడే కాంగ్రెస్ పనిపట్టారని, మెడలు వంచిన విషయం తెలియదా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరేంటో తెలుస్తుందని, వేణుగోపాల్ చేతనైతే రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి, ఇన్చార్జిగా ఉన్న చేవెళ్ల, సొంత స్థానం మహబూబ్నగర్ గెలిపించుకోవాలన్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని.. గతంలో కాంగ్రెస్కు ఉన్నది ఉన్నది ఆరు అసెంబ్లీ స్థానాలేననన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 39 శాసనసభ స్థానాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, తాము కూడా అధికారంలోకి వస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.