సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ‘నీళ్లు లేవు.. కరెంటు వస్తలేదు.. యాడికాడ ఎండిన పంటలను గొడ్లు మేస్తున్నయి. కాంగ్రెసోళ్లు పంటలను నాశనం చేసిన్రు. జనం ప్రభుత్వంపై అడ్డమైన కూతలు కూస్తున్నరు’ అంటూ గిరిజన రైతు రాములు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితో చెప్పుకొచ్చాడు. ఆదివారం సూర్యాపేట నుంచి ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రానికి వెళ్తున్న సందర్భంలో బొప్పారం తండా వద్ద రోడ్డు పక్కన ఉన్న రాములు అనే రైతు జగదీశ్రెడ్డి కారును ఆపాడు.
‘ఏం సంగతి అంతా బాగున్నారా? కాలం, కరెంటు పరిస్థితి ఏంది? అని జగదీశ్రెడ్డి ఆరా తీయగా.. ఆ రైతు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. ‘మొన్న కాంగ్రెస్కు ఓటేశారు కదా? మరి పార్లమెంట్ ఎన్నికల్లో మీ తండాల్లో మార్పు వచ్చిందా?’ అని జగదీశ్రెడ్డి అడిగితే.. ‘వాస్తవమే అయ్యా.. ఇయ్యాల జనం ఎవరెక్కడ పోరు.ఈ సారి మన ఓట్లు యాడికి పోవు..ఎవ్వలు చెప్పకున్నా మనసుకు అప్పు డే వచ్చింది’ అని రైతు రాములు చెప్పాడు. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పందిస్తూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ముందుకు కదిలారు.