కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం రాఘవేంద్రస్వామిని దర్శించుకొన్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయ మఠానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పీఠాధిపతి శేషవస్త్రంతో సత్కరించి ఫలమంత్రాక్షింతలు, జ్ఞాపికను అందజేశారు.
– మంత్రాలయం