హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పోలీస్శాఖలోని ప్రతి విభాగం సిబ్బంది పనితీరులో మరింత నిపుణత సాధించేందుకు కృషి చేయాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. శనివారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, పెండింగ్ కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలని పేరొన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతికత వినియోగించుకోవాలని, సైబర్ నేరాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీలు గోవింద్సింగ్, జితేందర్ పాల్గొన్నారు.