హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ క్లినిక్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ఓపీ సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి.
వీటికి అనుబంధంగా ఉన్న దవాఖానలు, ఎంసీహెచ్లలో ఈవినింగ్ క్లినిక్లు మొదలయ్యాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు ఈ క్లినిక్లో అందుబాటులో ఉండనున్నారు. ఉదయం ఓపీలో వచ్చి డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించుకున్నవారు రిపోర్ట్ వచ్చినా వైద్యుడి సలహా పొందేందుకు మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సి వస్తున్నదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతోపాటు సాయంత్రం వేళల్లో ఓపీ లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రైవేట్కు వెళ్లాల్సి వస్తున్నదని విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఈవినింగ్ క్లినిక్లను ప్రారంభించింది.