హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఒకటో గ్యారెంటీ, రెండో గ్యారెంటీ అంటూ హామీలను అర్రాస్ పాటలా ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సర్కారుకు మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చురక అంటించారు. భగవంతుడు కూడా ఆ పార్టీ హామీలను అమలు చేయలేడని అన్నారు. రైతుబంధు వేసేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారని, ఎండిన పంటలు, సాగు వెనక్కి వస్తాయా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుబంధును ఆపేసి వ్యవసాయాన్ని ఆగం చేసిందని ఆరోపించారు. కరెంటు, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతులకు కేసీఆర్ అండగా నిలిస్తే.. రేవంత్ అధికారంలోకి రాగానే అన్నీ కట బంద్ చేసినట్టుగా ఆగిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కరెంటు బంద్, రైతుబంధు బంద్, నీళ్లు బంద్ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి పంట కనీసం పావు వంతు కూడా సాగు కాలేదని, గత సంవత్సరం లెక్కలు, ఈ సంవత్సరం లెక్కలు బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. కాంగ్రెస్కు అధికారం లకీ దువ్వలో లాటరీ లాంటిదని, కేసీఆర్ను తిట్టడానికి రేవం త్ ముఖ్యమంత్రి కాలేదనే విషయాన్ని ఆయన గుర్తించాలని హితవు చెప్పారు. కొడంగల్ సభ లో రేవంత్ భాష, వ్యవహారశైలి ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు లేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎందుకో రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదని అన్నారు. రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.
174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా పాలమూరుకు రావాల్సిన నీటిని పోగొట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, హైదరాబాద్ రాష్ర్టాన్ని విలీనం చేయటంతో నష్టం జరిగిందని నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్దాల పాటు జూరాల, నెట్టెంపాడు, భీమా పథకాల నిర్మాణాలను కాంగ్రెస్ సాగదీసింది అని విమర్శించారు. 35-40 ఏండ్ల పాటు పాలమూరు ప్రాజెక్టును సాగదీసిన కాంగ్రెస్.. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టిందని ఆరోపించారు. 3.94 లక్షల ఎకరాల కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం 3.9 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించారని, 17 రిజర్వాయర్లను టెండర్లకు ముందే కాంగ్రెస్ ఎత్తివేసిందని తెలిపారు. సగం సగం పనులు గాలికి వదిలేసిందని గుర్తుచేశారు. గతంలో కల్వకుర్తి ఎత్తిపోతల పంపులన్నీ నీట మునిగాయని వెల్లడించారు. కాంగ్రెస్లా తాము ఏనాడూ రాజకీయం చేయలేదని, కేసీఆర్ హయాంలోనే పొలాలకు సాగునీరు అందిందని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసుల వేసినా, అన్నీ తట్టుకుని నీళ్లిచ్చే దశకు తీసుకువచ్చామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రైతాంగానికి నీళ్లు ఎవరిచ్చారో రైతులను అడిగితే చెప్తారని అన్నారు.
కేసీఆర్ ఎకడి నుండి వచ్చారని చవకబారు మాటలు మాట్లాడటం భావ్యం కాదని సీఎం రేవంత్రెడ్డికి నిరంజన్రెడ్డి హితవు చెప్పారు. ‘రేవంత్ కొడంగల్కు ఎందుకు వెళ్లాడు? అక్కడి నుంచి మలాజిగిరికి ఎందుకు వెళ్లాడు? రాహుల్ వాయనాడ్కు, సోనియాగాంధీ రాజస్థాన్కు ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు. ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా అని అన్నారు. కొడంగల్లో ఓడిపోయాక మలాజిగిరిలో ఎంపీగా గెలిచాక పార్లమెంట్లో తెలంగాణ సమస్యపై ఎన్ని సార్లు ప్రస్తావించారని, ఎన్నిసార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారని సీఎంను నిలదీశారు. కొడంగల్లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రేవంత్ నిధులు మంజూరు చేస్తున్నారని, అక్కడ శంకుస్థాపన చేసిన కాలేజీలన్నింటికీ అనుమతులు తెచ్చింది కేసీఆరే అని గుర్తుచేశారు. సమావేశంలో అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, క్యామ మల్లేశ్ పాల్గొన్నారు.