పెద్దపల్లి, మే 2: పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన తండ్రీకొడుకులు లెంకల మహిపాల్రెడ్డి, లెంకల వివేకానందరెడ్డి ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎతె్తైన శిఖరం మౌంట్ కోసియసో (2,228 మీటర్లు / 7,310 అడుగులు)ను అధిరోహించారు. గత నెల 30న ప్రయాణం ప్రారంభించి, మే 2 (శనివారం) సాయంత్రం 6.30 గంటలకు (ఆస్ట్రేలియా స్థానిక కాలమానం ప్రకారం) శిఖరాన్ని చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు ‘సే నో టూ డ్రగ్స్’ అనే సందేశ బ్యానర్, జాతీయ పథకాన్ని ప్రదర్శిస్తూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, క్రీడలు, ఇతర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. లెంకల మహిపాల్రెడ్డి, వివేకానందరెడ్డిని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా మారెటింగ్ అధికారి ప్రవీణ్రెడ్డి, డీవైఎస్వో సురేశ్ అభినందించారు.