Minister KTR | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తైవాన్కు చెందిన ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంస్థ కూడా ముందుకు వచ్చింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో యూరప్కు చెందిన యూరోఫిన్స్( Eurofins Group ) సంస్థ బృందం శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సంస్థ పెట్టుబడి ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశంలో బయోఫార్మా( Bio Pharma ) సర్వీసెస్ యూరప్ ప్రెసిడెంట్ నటాలియా శుమాన్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. కేటీఆర్ దావోస్ పర్యటనలో వెయ్యి కోట్ల పెట్టుబడిని యూరోఫిన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
Minister @KTRBRS met with @natalia_shuman, EVP and President, BioPharma Services Europe @EurofinsGroup to discuss their investment plans for Hyderabad. pic.twitter.com/8EhFJeBveX
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 4, 2023