Rohit Pawar : విమాన ప్రమాదం (Flight crash) లో అజిత్ పవార్ (Ajit Pawar) మరణించిన ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేవరకు పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తన పదవికి రాజీనామా చేయాలని.. అజిత్ పవార్ మేనల్లుడు, శరద్పవార్ ఎన్సీపీ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ (Rohit Pawar) డిమాండ్ చేశారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పౌరవిమానయాన మంత్రి రాజీనామా చేయాలని అన్నారు.
శనివారం మధ్యాహ్నం శరద్పవార్ నివాసంలో రోహిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గురైన ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్కు ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాల పాత్ర ఇందులో ఏమైనా ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానని చెప్పారు. ఆ లేఖ మరో కాపీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా పంపినట్లు తెలిపారు.